English | Telugu

షాకింగ్ న్యూస్: 'బాహుబలి 2' ప్రభాస్ తో కాదంట

'Baahubali' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా పది రోజుల సమయం వుంది. కానీ అప్పుడే 'బాహుబలి పార్ట్ 2'పై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి అనుకున్న రెంజులో హిట్టైతే కానుక 'Baahubali part 2'ను మరింత భారీగా నిర్మించాలనే ఆలోచనలో Rajamouli వున్నట్లు సమాచారం.

అందుకోసం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం తొలి పార్ట్ తోనే తిరిగి రాబట్టాలని రాజమౌళి టీమ్ ఆలోచిస్తుందట. దానిలో భాగంగానే 'బాహుబలి' తొలి భాగానికి పకడ్బందీగా మార్కెటింగ్ ప్లాన్ చేశారట. అనుకున్నట్టుగానే బహుబలికి ఇండియాలో భారీగా హైప్ క్రియేట్ చేసి, ఎక్కువగా బిజినెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు రాజమౌళి టీమ్ బాహుబలి 2 దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. బాహుబలి రిలీజ్ తరువాత ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసుకొని బాహుబలి 2 కి స్టొరీ సిద్దం చేయాలని నిర్ణయించుకున్నారట. దీని కోసం ఇప్పటికి వరకు చిత్రీకరించిన 20శాతం సినిమాగా పక్కన పెట్టేశారట.అలాగే బాహుబలి 2 కి మరింత మార్కెట్ పెంచడానికి బాలీవుడ్ సూపర్ స్టార్లను తీసుకోవాలని రాజమౌళి ప్లానింగ౦టా. ఇందంతా చూస్తుంటే బాహుబలి 2 ప్రభాస్ కనిపించడం కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏది ఏమైనా ఓ విషయం స్పష్టమవుతోంది. బాహుబలి తో ఆంధ్రుల సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చుపించానున్నాడు రాజమౌళి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.