English | Telugu

ఎన్టీఆర్ కెరీర్లోనే బాద్‌షా ఓవర్సీస్ రైట్స్ రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాద్షా ఓవర్సీస్ రైట్స్ అందరినీ ఆశ్చర్య పరిచింది. బాద్‌షా ఓవర్సీస్ రైట్స్ రూ.4.5కోట్లకు అమ్మడు పోయాయి. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎంటైర్ కెరీర్లోనే ఓవర్సీస్ రైట్స్ ఈ రేంజిలో రావడం ఇదే తొలి సారి. దర్శకుడు శ్రీను వైట్ల కు ఓవర్సీస్ మంచి డిమాండ్ ఉంది. శ్రీనువైట్ల ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రం కోసం అబిమానులు ఎదురుచుస్తునారు. జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ‘బాద్ షా' సినిమా మార్చి లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Tags : Baadshah Overseas Rights, Baadshah Movie Overseas Rights , NTR Baadshah Overseas

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.