English | Telugu

పవన్ పాటకు సెన్సార్ అడ్డు

పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రానికి మొట్టమొదటిసారిగా ఓ సమస్య తలెత్తింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని "బాపు గారి బొమ్మో" పాటలో "ఓల్డు మంకు రమ్మో" అనే పదాలు ఉండడం వల్ల సెన్సార్ సభ్యులు ఈ పదాలను తీసేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఈ పాట రాసిన రామజోగయ్యశాస్త్రి, మళ్ళీ కొన్ని మార్పులు చేసి పాటను పూర్తి చేయనున్నట్లు తెలిసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.