English | Telugu

చెన్నై రైలెక్కిన చిన్నది

బెజవాడ సినిమాలతొ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల భామ అమలా పాల్.. తొలి సినిమా సక్సెస్‌ను అందించలేకపోయిన అమలా పాల్‌ మాత్రం ఆకట్టుకుంది.. దీంతో ఈ అమ్మడు ఇక టాలీవుడ్‌ను ఊపేస్తుంది అనుకున్నారు అంతా.. కాని అమల తరువాత నటిచిన లవ్‌ ఫెయిల్యూర్‌ సినిమా కూడా నిరాశపరచడంతొ అమలపాల్‌కు ఆశించిన స్ధాయి అవకాశాలు రాలేదు.. కాని తొలి రెండు సినిమాల్లో గ్లామర్‌తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాదించటం.. వరుసగా ఇద్దరు మెగా హీరోలతో నటించే చాన్స్‌ కొట్టేసింది..



రామ్‌చరణ్‌ హీరో వినాయక్‌ డైరెక్షన్‌తో తెరకెక్కిన నాయక్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అమల.. ఈ సినిమా మంచి సక్సెస్‌ సాదించటంతో పాటు చెర్రీ లాంటి టాప్‌ స్టార్‌ సరసన నటించటంతో ఈ అమ్మడి పంట పండింది అనుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే వెంటనే మరో మెగా హీరో అల్లు అర్జున్‌ సినిమాలో హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసింది.. మరోసారి ఈ సినిమా ఆశించిన స్ధాయి విజయం సాదించక పోవటంతో అమలకు టాలీవుడ్‌లో అవకాశాలే లేకుండా పోయాయి..



దీంతో ఇప్పుడు చెన్నై చెక్కేసింది ఈ భామ..తాజాగా విజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన తలైవా సినిమా ఈ ఆగస్టు 7 రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఇక అక్కడ తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.