English | Telugu

మైకంలో పడేస్తానంటున్న చార్మి

దాదాపు అందరు అగ్రకథానాయకుల సరసన హీరోయిన్‌గా నటించినా, ఆ స్టార్‌డమ్‌ నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిల్‌ అయింది హీరోయిన్‌ చార్మీ.. టాలీవుడ్‌లో పెద్ద గా ఆదరణ లేని లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో అయినా ఆకట్టుకోవాలనుకున్నా అది కూడా వర్కవుట్‌ కాలేదు.. మంత్ర, మంగళ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాసులు రాల్చే స్టార్‌ డమ్‌ ను మాత్రం ప్రూవ్‌ చేసుకోలేకపోయింది. దీంతో అందాల ప్రదర్శనకు కూడా రెడీ అయిందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో నటిగా నిరూపించుకోవాటనికి స్టార్‌ హీరోయిన్స్‌ సైతం నమ్ముకున్న వేశ్య పాత్రలో కనిపింస్తుతుంది చార్మీ.. ప్రేమే ఓ మైకం అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, ఓ వేశ్య ఓ గాయకుడు, ఓ రచయిత చుట్టూ తిరుగుతుంది..



ఇప్పటికే శ్రియ వేశ్యపాత్రలో నటించిన పవిత్ర సినిమా మంచితో మంచి పేరు సంపాదించుకున్నా కాసులు మాత్రం కురిపించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సినిమా అయిన చార్మీని సక్సెస్‌ ట్రాక్‌ లోకి తెస్తుందేమో చూడాలి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.