English | Telugu

స్టైలిష్ స్టార్ ని పట్టిన మిర్చి డైరెక్టర్!!

సాధారణంగా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం చాలా కష్టం. కానీ రైటర్ టర్న్ డైరెక్టర్ మారిన కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'మిర్చి' సినిమా చేసి ప్రేక్షకులకు తన టాలెంట్ ఘాటును చూపించాడు. ఇండస్ట్రీలో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన మిర్చితో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో శివ కూడా చేరాడు. కానీ రెండో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం మహేష్ శ్రీమంతుడు సినిమాను చేస్తున్న శివకు మూడో సినిమా మాత్రం వెంటనే ఓకే అయ్యింది. అల్లు అర్జున్ కి ఇటీవలే కథ వినిపించి ప్రాజెక్టు ఓకే చేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యక సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాయి. ఈ సినిమా తరువాత కొరటాల శివ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.