English | Telugu

ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్', 'ఉప్పెన' చిత్రాలు 2023 జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రి సంస్థ ప్రత్యేక పార్టీని నిర్వహించింది. ఇందులో అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పలు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "బాలీవుడ్ కి వెళ్ళమని ఈ 20 ఏళ్ళలో దేవిశ్రీప్రసాద్ కి ఎన్నోసార్లు చెప్పాను. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ 'ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక నేనూ వస్తా' అనేవాడు. కానీ అది సాధ్యమవుతుందా అని నేను అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీలో కూడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ళ నుంచి దేవి అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరికీ నేషనల్ అవార్డ్స్ రావడం పట్ల మా నాన్న(అల్లు అరవింద్) ఎంతో ఆనందించారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం, ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటామని అనుకున్నావా అని నేను ఆయనతో సరదాగా అన్నాను. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని అంటుంటారు. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా కోరుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ నాకు జాతీయ అవార్డు రావాలని నాకంటే బలంగా సుకుమార్ కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అఛీవర్.. నేను అఛీవ్ మెంట్ మాత్రమే" అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.