English | Telugu

నాగపుర్ లోనాగార్జున, అఖిల్

నాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళారట. అదీ మార్చ్ 12 వ తేదీ ఉదయానికి నాగార్జున, అఖిల్ నాగపూర్ కి వెళ్ళారు. నాగపుర్ లోనాగార్జున, అఖిల్ కి ఏం పని...? షూటింగ్ పని మీద వెళ్ళారా...? కాదుగాక కాదు. కానే కాదు. మరెందుకు నాగార్జున, అఖిల్ నాగపుర్ కి వెళ్ళింది.ఈ ప్రశ్నకు సమాధానం నాగపూర్ లో వరల్డ్ కప్ లో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ ని చూడటానికి. నాగార్జున చిన్న కుమారుడు అఖల్ మంచి క్రికెటర్ అన్న విషయం స్టార్స్ క్రికెట్ మ్యాచ్ టాలీవుడ్ ట్రోఫీలో ఆడినప్పుడే తెలిసింది.

నాగార్జున చిన్న కుమారుడు అఖల్ కి క్రికెట్ అంటే ప్రాణమనీ, అతని ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కరని వేరే చెప్పక్కరలేదు కదా. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే కిక్కే వేరు. అది గాక తన అభిమాన క్రికెటర్ సచిన్ ని కూడా కలవచ్చన్న కోరికతో కూడా తండ్రి నాగార్జునను తీసుకుని అఖిల్ నాగపూర్ కి వెళ్ళాడు. భవిష్యత్తులో అఖిల్ మంచి క్రికెటర్ అవుతాడని ఆశిద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.