English | Telugu

'ధీర'గా అఖిల్.. మరో భారీ రిస్క్!

భారీ బడ్జెట్ తో రూపొందిన 'ఏజెంట్' దారుణంగా నిరాశపరిచినా అఖిల్ అక్కినేని మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రయోగాలు, భారీ చిత్రాల జోలికి పోకుండా.. కొంతకాలం పాటు సింపుల్ లవ్ స్టోరీలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుండి వ్యక్తమవుతున్నా అఖిల్ మాత్రం భారీ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నాడు.

అఖిల్ తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంతో 'సాహో'కి దర్శకత్వ విభాగంలో పని చేసిన అనిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడట. ఈ చిత్రానికి 'ధీర' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం సౌత్ నుంచి, నార్త్ నుంచి పలువురు స్టార్స్ ని రంగంలోకి దింపబోతున్నట్లు వినికిడి. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని ఇన్ సైడ్ టాక్. భారీ తారాగణంతో పాన్ ఇండియా మూవీగా దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందనుందట. మరి 'ఏజెంట్' తర్వాత మరో భారీ రిస్క్ చేస్తున్న అఖిల్ కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.