English | Telugu

అఖండ-2 అప్డేట్.. 20 నిమిషాలు బాలయ్య తాండవం!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అఖండ-2'. బాలయ్య-బోయపాటి కాంబోతో పాటు, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'అఖండ'కి సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (Akhanda 2 Thaandavam)

బాలయ్య-బోయపాటి కాంబో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'అఖండ'లో యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు 'అఖండ-2'లో అంతకుమించిన యాక్షన్ ఉండబోతుందట. ముఖ్యంగా 20 నిమిషాల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తాండవం చూడనున్నామని, ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.