English | Telugu

‘ఓజీ’ షోలో విషాదం.. ‘పుష్ప2’ ఘటన రిపీట్‌ అయిందా?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఓజీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా హై బజ్‌ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సెప్టెంబర్‌ 25 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూసెయ్యాలన్న క్రేజ్‌ ఫ్యాన్స్‌లో ఉంటుంది. క్రౌడ్‌ ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ ఘటన ‘ఓజీ’ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని ఏషియన్‌ థియేటర్‌లో ఓజీ సినిమా ప్రదర్శన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. అభిమానులు అధిక సంఖ్యలో థియేటర్‌లోకి రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పీకర్లు కింద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. కెపాసిటీకి మించి సుమారు 1200 మందిని లోపలికి అనుమతించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, లోపల ఉక్కిరిబిక్కిరి అయ్యామని అభిమానులు ఆరోపిస్తున్నారు. థియేటర్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో గత ఏడాది విడుదలైన ‘పుష్ప2’ ప్రీమియర్స్‌ సందర్భంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళిపోయి కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్ళీ జరగకుండా థియేటర్‌ యాజమాన్యం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.