English | Telugu

వంద కోట్లు ‘పీకే’సిందట..!

అమీర్‌ తాజా చిత్రం ‘పీకే’కి విపరీతమైన పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల మార్కుని చేరిపోయింది. ఇంకా క్రిస్మస్‌ హాలిడేస్‌ మొదలు కానే లేదు. కానీ పికె టికెట్ల కోసం జనం పోటీలు పడిపోతున్నారు. అంటే ఈ జోరు మరో వారం రోజుల పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు వందల కోట్ల మార్కుని దాటడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి లాంగ్‌ రన్‌ ఉంటుందా, మూడు వందల కోట్ల మార్కుని కూడా అందుకుని కొత్త రికార్డు నెలకొల్పుతుందా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఇప్పుడు నంబర్‌వన్‌ హీరో తనే అని అమీర్‌ఖాన్‌ ఇంకోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.