English | Telugu

'ఆదికేశవ' వాయిదా.. మరీ ఇంత వెనక్కా!

వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈరోజు(ఆగస్టు 18న) విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఊహించినట్లుగానే ఈ సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్, అక్టోబర్ కాదు.. ఏకంగా నవంబర్ కి వాయిదా పడింది.

ఆదికేశవ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవ‌లే ఆదికేశ‌వ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో అతను తన నాలుగో సినిమా 'ఆదికేశవ'తో యాక్షన్ బాట పట్టాడు. మరి ఈ చిత్రం అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.