English | Telugu

‘టెంపర్‌’ షూటింగ్‌ పోస్ట్‌పోన్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్‌’ సినిమా షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ చేశారు. ఎన్టీఆర్ సోదరుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన తీవ్రంగా కలిచివేసింది. దీంతో కొద్ది రోజులు సినిమా షూటింగ్ లకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తన సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌, బండ్ల గణేష్‌ లకు చెప్పడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న వారు పది రోజులపాటు షూటింగ్ ని వాయిదా వేశారు. తాజా పరిస్థితుల వల్ల ‘టెంపర్‌’ జనవరి 9న విడుదలవ్వడం కష్టమేనని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పూరి జగన్నాథ్‌ స్పీడ్ కే సపోర్ట్ చేస్తున్నారు. సినిమాని అనుకున్న టైమ్‌లో, ఇంకాస్త ముందే ఫినిష్‌ చేయడంలో పూరి దిట్ట అని, ఎన్టీఆర్‌ సహకారంతో ‘టెంపర్‌’ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. అయితే పూరి ‘టెంపర్‌’ ని స్పీడ్ గా ఫినిష్ చేస్తాడా? లేక పోస్ట్‌పోన్‌ చేస్తాడా? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.