English | Telugu

చిట్టీల రాణి జంపు జిలానీ...!

బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి పారిపోయారు. విజయరాణి గతకొంత కాలంగా చిట్టీల పేరుతో పలువురు జూనియర్ ఆర్టిస్టుల నుండి డబ్బులు సేకరించింది. బాగా నమ్మకం కల వ్యక్తిగా, మంచిగా అందరితో మాట్లాడే మనిషిగా నమ్మకం కలిగించడంతో ఎక్కువమంది ఈమె వద్దనే చిట్టీలు వేసారు. అయితే ఆ డబ్బు దాదాపు 8కోట్ల రూపాయల వరకు జమ అవడంతో.. ఇదే సరైన సమయం అని భావించిన విజయరాణి, ఆ డబ్బుతో జంపు జిలానీ.

అయితే కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఊరెళ్ళి ఉండవచ్చేమో అనుకొని బాధితులు భావించారు. కానీ ఎంతకీ తన ఆచూకీ లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం విజయరాణి కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. విజయరాణి ఇలా చేస్తుందని తాము ఊహించలేకపోయామని, పిల్లల భవిష్యత్ కోసం ఆమె దగ్గర చిట్టీలు వేశామని వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.