Read more!

English | Telugu

మెగాస్టార్ క్లాప్ తో మొదలైన నితిన్, రష్మిక కొత్త చిత్రం

నితిన్, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' సినిమా 2020, ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిజానికి వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఏవో కారణాల అది పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో 'భీష్మ' జోడి నితిన్, రష్మిక తోనే వెంకీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఇక ఈ మూవీ లాంచ్ వేడుకకు చిరంజీవి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ క్లాప్ తో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ వేడుకలో మూవీ టీమ్ తో పాటు దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి, హను రాఘవపూడి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి శ్రీరామ్, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ గా రామ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.