English | Telugu

'గుంటూరు కారం'కి పోటీగా రౌడీ హీరో మూవీ!

వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కోసం ఇప్పటికే 'ప్రాజెక్ట్ k', 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్' సినిమాలు కర్చీఫ్ వేశాయి. అయితే వీటిలో 'ప్రాజెక్ట్ k' సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని, వేసవికి వాయిదా పడనుంది అంటున్నారు. అదే జరిగితే సంక్రాంతి బరిలో బిగ్ స్టార్ సినిమాగా మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' ఒక్కటే మిగుతుంది. అయినప్పటికీ 'హనుమాన్', 'ఈగల్' సినిమాల రూపంలో గట్టి పోటీనే ఎదురయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పోరుని మరింత రసవత్తరంగా మార్చడానికి కొత్తగా మరో సినిమా ఎంట్రీ ఇచ్చింది.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 13వ రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా మూవీ షూటింగ్ ప్రారంభమైందని చెప్పిన మేకర్స్, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.