English | Telugu

నేరుగా ఓటీటీకి స్టార్ హీరోయిన్ మూవీ..!

ఇది ఓటీటీ యుగం. థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీ కోసమే ప్రత్యేకంగా రూపొందుతున్నాయి. స్టార్స్ సైతం ఓటీటీ కోసం సినిమాలు, సిరీస్ లు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. కీర్తి సురేష్ నటిస్తున్న 'ఉప్పు కప్పురంబు' చిత్రం కూడా నేరుగా ఓటీటీలో అలరించనుంది. (Uppu Kappurambu)

కీర్తి సురేష్, సుహాస్ ప్రధాన పాత్రల్లో అని ఐ.వి. శశి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉప్పు కప్పురంబు'. ఎల్లనార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మిస్తున్న ఈ సినిమా జులై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. స్మశానం నేపథ్యంలో ప్రధాన పాత్రధారులను చూపిస్తూ రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

1990ల నాటి గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.