English | Telugu

త్రిష పెళ్లి కబుర్లు

దాదాపు ఒక దశాబ్దం పాటు తెలుగు, తమిళ సినీ రంగాలను ఏలిన హీరోయిన్ త్రిష తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ న్నిపెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడబోతోంది. ఈనెల 23న చెన్నైలో ఒక స్టార్ హోటల్లో వారి నిశ్చితార్ధ వేడుక జరుగబోతోంది. ఆరోజున ఆమెకు కాబోయే వరుడు వరుణ్ రూ. 7 కోట్లు విలువచేసే నల్లటి రంగు గల ‘రోల్స్‌ రాయిస్’ కారుని బహుమానంగా ఇవ్వబోతున్నట్లు చెన్నై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. కానీ జనవరి 24న దక్షిణాదిన చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరినీ పిలిచి భారీగా విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎవరయినా పెళ్లి రోజున లేదా ఆ తరువాత అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ త్రిష వెరైటీగా పెళ్ళికి ముందే విందు భోజనం తినిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వారి వివాహం గురించి మరొక ఆసక్తికరమయిన వార్త కూడా వినిపిస్తోంది. వారిరువురూ తమ వివాహ వేడుకని ఎగిరే విమానంలో జరుపుకోవాలనుకొంటున్నట్లు సమాచారం. అదే నిజమయితే త్రిష పెళ్ళి వేడుక కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. కానీ విమానంలో పెళ్లి జరుపుకొనేమాటయితే ముఖ్యమయిన అతికొద్ది మంది మాత్రమే దానికి హాజరు కాగలుగుతారు. మిగిలినవారందరూ ఇంట్లో కూర్చొని వీడియోలో చూస్తూ చప్పట్లు కొట్టి సంతృప్తి పడవలసి వస్తుందేమో?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.