English | Telugu

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తున్న హీరో!

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తమిళ ప్రేక్షకుల కన్నా, తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఆదరిస్తారని కార్తీ చెబుతుంటాడు. అలాంటి కార్తీ, తన సినిమాల విడుదల తేదీల విషయంలో తప్పటడుగులు వేస్తున్నాడు. దాంతో తెలుగునాట తన సినిమాలకు నష్టం జరుగుతోంది.

కార్తీ గత చిత్రం 'సత్యం సుందరం' తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28న విడుదలైంది. అయితే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' విడుదలైంది. దాంతో తెలుగులో 'సత్యం సుందరం'కి రావాల్సినంత ఆదరణ దక్కలేదు. నిజానికి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే 'దేవర' ప్రభంజనంలో.. ఈ సినిమా సామాన్యులకు అంతగా చేరువ కాకపోవడంతో, బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు.. ఆ తర్వాత ఓటీటీలో చూసి, ఇంతమంచి సినిమాని సరైన సమయంలో విడుదల చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 'దేవర'తో పోటీగా కాకుండా, సోలోగా విడుదలైనట్లయితే 'సత్యం సుందరం' చిత్రం తెలుగునాట మరిన్ని వసూళ్లను రాబట్టి పెద్ద విజయం సాధించి ఉండేది.

'సత్యం సుందరం' విషయంలో చేసిన తప్పునే, కార్తీ తన నెక్స్ట్ మూవీ విషయంలోనూ చేస్తున్నాడు. కార్తీ నుండి వస్తున్న అప్ కమింగ్ మూవీ 'వా వాతియార్' (Vaa Vaathiyaar). నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే తేదికి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ-2' వస్తోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో.. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగునాట 'అఖండ-2' ప్రభంజనంలో వేరే సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. దాంతో తెలుగులో కార్తీ 'వా వాతియార్' సినిమాకి నష్టం తప్పేలా లేదు.

తమిళ్ తో పాటు తెలుగు మార్కెట్ కూడా కార్తీకి కీలకం. కానీ, విడుదల తేదీల విషయంలో తెలుగు మార్కెట్ ని పట్టించుకోకుండా రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలకు తగ్గట్టుగా తన రిలీజ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదంటే, 'సత్యం సుందరం'కి జరిగినట్టుగా.. మంచి సినిమాలు కూడా ఓటీటీ ప్రశంసలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.