English | Telugu

ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న విక్రమ్ బ్రదర్స్ 

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ వారం ఏదో ఒక రీ రిలీజ్ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాలు రీ రిలీజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘తమ్ముడు’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలెన్నో రీ రిలీజ్ అయి రికార్డులు సృష్టించాయి. ఇక ఇప్పుడు ‘తమ్ముడు’ మూవీని రేపే (ఆగస్ట్ 30) గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతోన్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ మూవీని ఇలా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ముందే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఈ ‘తమ్ముడు’ మూవీ మళ్లీ థియేటర్లోకి రానుంది.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఫిల్మ్స్‌పై శ్రీమతి మునీశ్వరి సమర్పించు ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్ హక్కుల్ని ఉత్తరాంధ్రకు చెందిన వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద విక్రమ్ బ్రదర్స్, ఆసన్ సూర్య దేవర చేజిక్కించుకుని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ‘తమ్ముడు’ మూవీ రీ రిలీజ్‌ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

తమ్ముడు 1999లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల అందించిన సంగీతం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.