Read more!

English | Telugu

స్నిగ్ధపై లైంగిక దాడి.. తండ్రి పక్కన పడుకోవాలన్నా...

స్త్రీ జీవితం అంత తేలికైనది కాదు. వయసుతో సంబంధం లేకుండా మానవ మృగాల మధ్య మాన ప్రాణ భయంతో బతకాల్సి ఉంటుంది. యువతులు, మహిళల మీద మాత్రమే కాకుండా.. అభంశుభం తెలియని చిన్నారుల మీద లైంగిక దాడులు జరగం మనం వింటుంటాం. అలాంటి ఘటనల కారణంగా పసి హృదయాలు గాయపడి.. కన్న తండ్రితో సహా మగవాళ్ళు కనిపిస్తేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అనుభవమే నటి, గాయని స్నిగ్ధ(Snigdha)కి ఎదురైంది.

రీతూ చౌదరి(Rithu Chowdary) హోస్ట్ గా 'దావత్' అనే టాక్ షో యూట్యూబ్ లో ప్రసారమవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. 15వ ఎపిసోడ్ లో స్నిగ్ధ పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి గల ఈ ప్రోమోలో.. మొదట స్నిగ్ధ ఎంతో సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచింది. ఆ తర్వాత తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను బయటపెట్టింది. చిన్నతనంతో తన మీద లైంగిక దాడి జరిగిందని, ఎలాగోలాగ తప్పించుకొని వచ్చేశానని తెలిపింది. కానీ ఆ భయం తనను దాదాపు పదేళ్లు వెంటాడిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ సమయంలో తన తండ్రి పక్కన పడుకొని నిద్రపోవాలన్నా భయమేసేదని చెప్పింది. తన బాబాయ్, మావయ్యలు మునుపటిలా ముద్దాడినా అది గుడ్ టచా? బ్యాండ్ టచా? అని అనుమానించేదానిని అని తెలిపింది. స్నిగ్ధ చెప్పిన ఈ మాటలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి.