Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ పై అనసూయ కీలక వ్యాఖ్యలు.. పార్టీ కాదు పర్సన్ ముఖ్యం 

జబర్దస్త్ అనే కామెడీ షో తో తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఆ షో కి ఆమె చేసిన యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆ తర్వాత సినిమా నటిగాను టర్న్ అయ్యి ఎన్నో సినిమాల్లో అధ్బుతమైన పాత్రలని కూడా పోషించింది. తాజాగా ఆమె  పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.

అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆమె కెరీర్ తో పాటు పలు అంశాలపై సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకి   తనదైన స్టైల్లో జవాబులు చెప్పింది. ఈ క్రమంలో  పవన్ కళ్యాణ్ (pawan kalyan) పిలిస్తే జనసేన (janasena)  తరుపున ప్రచారం చేస్తారా అని యాంకర్  అడిగాడు. దాంతో ఆమె చెప్పిన సమాధానం అందర్నీ ఆలోచింప చేసింది. నాకు పార్టీలతో సంబంధం లేదు. వ్యక్తి మాత్రమే ముఖ్యం. ముందుగా పోటీ చేసే వ్యక్తి గురించి పూర్తిగా  తెలుసుకుంటాను. ఆ తర్వాత అవసరమైతే ప్రచారం చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఆమె చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి

నాగబాబు, రోజా చెరో ఒక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎవరకి ప్రచారం చేస్తారు అని కూడా యాంకర్ అడిగాడు.  ఇద్దరకీ ప్రచారం చేస్తాను అనే రీతిలో ఆమె ఆన్సర్ చెప్పింది. వాళ్లిదరు కూడా  తనకి చాలా క్లోజ్ అని కాకపోతే నాగబాబు గారితో ఇంకొంచెం ఎక్కువ బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది. అనసూయ మెగా ఫ్యామిలీ కి చెందిన చాలా సినిమాల్లో నటించింది. లేటెస్ట్ గా ఆమె రజాకార్(razakar) అనే సినిమాలో చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. ఆమె పోషించిన  క్యారక్టర్ కి మంచి పేరు వస్తుంది.