English | Telugu

"సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" షూటింగ్ ప్రారంభం

"సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" షూటింగ్ ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ అన్నగా, ప్రిన్స్ మహేష్ బాబు తమ్ముడుగా నటిస్తూండగా, "కొత్తబంగారు లోకం" ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని "పానావిజన్" కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఈ కెమెరాని పానావిజన్ కంపెనీ వారు ప్రసాద్ ల్యాబ్ వారి ఆధ్వర్యంలో మాత్రమే దక్షిణాదిన అద్దెకిచ్చారు. ఈ కంపెనీ ఈ కెమెరాలను అమ్మదు. కేవలం అద్దెకు మాత్రమే ఇస్తుందని సమాచారం.

ఈ కెమెరా రెంట్ రోజుకి 35 వేల రూపాయలు. గతంలో రామ్ చరణ్"ఆరెంజ్" చిత్రానికి కూడా ఇదే కెమెరాని వాడారు. తర్వాత ప్రకాష్ రాజ్ తన దర్శకత్వంలో రాబోయే "ధోనీ" చిత్రానికి కూడా ఇదే కెమెరాని వాడుతున్నారు. "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. వెంకటేష్, మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ హీరోలు కలసి నటిస్తూండటంతో "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఈ చిత్రం మీద భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.