English | Telugu

సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా! అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్! 

-సరైనోడు సీక్వెల్ లో హీరో ఎవరు
-రామ్ చరణ్, అల్లు అర్జున్ తో మల్టీస్టారర్
-అల్లు అరవింద్ కోరిక ఏంటి!
-అసలు సరైనోడు సీక్వెల్ ఉందా!

కొన్ని చిత్రాలు అంత తేలికగా అభిమానులు,ప్రేక్షకుల మస్తిష్కం నుంచి దూరమవ్వవు. అఫ్ కోర్స్ ఆ మూవీ హీరో, మేకర్స్ కూడా సేమ్ సిట్యువేషన్ లోనే ఉంటారు. అలాంటి వైబ్రేషన్ ని సంపాదించుకున్న మూవీ 'సరైనోడు'(Sarrainodu). హీరోగా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)రేంజ్ ని మరింతగా పెంచిన చిత్రం కూడా. ఈ విషయాన్నీచాలా సందర్భాల్లో అల్లు అర్జునే చెప్పుకొచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)రేంజ్ కూడా సరైనోడుతోనే మరింతగా పెరిగింది. సమ్మర్ కానుకగా 2016 ఏప్రిల్ 22 న మండు వేసవిలో రిలీజై మండు వేసవికి సైతం చెమటలు పట్టించేలా కలెక్షన్ల తుఫాన్ ని సృష్టించింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతుంది. దీంతో సీక్వెల్ కి సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తు వస్తున్నారు. రీసెంట్ గా సరైనోడు ని నిర్మించిన అల్లు అరవింద్ సీక్వెల్ గురించి మాట్లాడటం జరిగింది. తన అప్ కమింగ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతు సరైనోడు సీక్వెల్ ని తెరకెక్కించడం జరిగితే నా బ్యానర్ లోనే ఉంటుందని చెప్పాడు. ఒక రకంగా అభిమానులకి ఈ విషయంపై ఆనందంగానే ఉన్నా, కొత్త డౌట్స్ ని కూడా తీసుకొచ్చింది. అల్లు అరవింద్ మాటల్లో తెరకెక్కించడం ఖాయమైతే కనుక అని వచ్చింది. అంటే ఇంకా అధికారకంగా డిసైడ్ అవ్వలేదనే అర్ధం. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో సీ క్వెల్ పై చర్చ జరుగుతుంది.


కానీ ఒక్కటి మాత్రం నిజం. అల్లు అర్జున్ ఒక సందర్భంలో మాట్లాడుతు తక్కువ సమయంలో ఫక్తు కమర్షియల్ సినిమా చేస్తానని, బోయపాటి తోనే చేస్తానని వెల్లడి చేసాడు. దీంతో అల్లు అరవింద్ నుంచి అభిమానులు దాకా సరైనోడుకి సీక్వెల్ చెయ్యమని కోరుతున్నారు. దీంతో సీక్వెల్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అల్లు అర్జున్, బోయపాటి మధ్య మంచి అనుబంధం ఉండటం కూడా అభిమానుల కోరికకి బలాన్ని ఇస్తుంది.

Also read: ఇది కదా కావాల్సింది చరణ్.. చికిరి కి భలే అర్ధం చెప్పావు

ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ మాట్లాడుతు రామ్ చరణ్(Ram Charan)అల్లు అర్జున్(Allu Arjun) తో భారీ మల్టి స్టారర్ తెరకెక్కించాలనేది తన కోరిక అని చెప్పాడు. ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇద్దరు మాస్ హీరోలు కాబట్టి సరైనోడు సీక్వెల్ లోనే ఇద్దరు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం