English | Telugu

'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్.. మరో కేజీఎఫ్ అవుతుందా..?

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సంబరాల ఏటి గట్టు'. రోహిత్ కె.పి. దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. రాయలసీమ ప్రాంతంలో కరవును అంతం చేయడానికి తపనపడే మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథగా 'సంబరాల ఏటి గట్టు' చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. (Sambarala Yeti Gattu Glimpse)

నేడు(అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం నిడివితో రూపొందించిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మైన్స్ లో బానిసల్లా పని చేస్తున్న ప్రజల తరపున నిలబడి, పోరాడే యోధుడిలా సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ సెటప్.. కేజీఎఫ్ ప్రపంచాన్ని గుర్తు చేసేలా ఉంది. ఇక సాయి తేజ్ మేకోవర్ కూడా మెప్పించింది. సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. "అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం" అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ కట్టిపడేసింది. మూవీ సెటప్, సాయి తేజ్ లుక్, యాక్షన్, విజువల్స్, బీజీఎం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్, సాలిడ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.