English | Telugu

'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్.. మరో కేజీఎఫ్ అవుతుందా..?

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సంబరాల ఏటి గట్టు'. రోహిత్ కె.పి. దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. రాయలసీమ ప్రాంతంలో కరవును అంతం చేయడానికి తపనపడే మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథగా 'సంబరాల ఏటి గట్టు' చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. (Sambarala Yeti Gattu Glimpse)

నేడు(అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం నిడివితో రూపొందించిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మైన్స్ లో బానిసల్లా పని చేస్తున్న ప్రజల తరపున నిలబడి, పోరాడే యోధుడిలా సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ సెటప్.. కేజీఎఫ్ ప్రపంచాన్ని గుర్తు చేసేలా ఉంది. ఇక సాయి తేజ్ మేకోవర్ కూడా మెప్పించింది. సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. "అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం" అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ కట్టిపడేసింది. మూవీ సెటప్, సాయి తేజ్ లుక్, యాక్షన్, విజువల్స్, బీజీఎం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్, సాలిడ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం