English | Telugu

నాగ్ జోడీగా స‌మంత‌


మ‌నంలో స‌మంత - నాగార్జున త‌ల్లీకొడుకుల్లా న‌టించారు! నాగ్ స‌మంత‌ని అమ్మా అమ్మా అని పిలుస్తుంటే... చూడ్డానికి ముచ్చ‌ట‌గా అనిపించింది. మ‌రి ఇప్పుడు వీరిద్ద‌రూ క‌ల‌సి జోడీ క‌ట్ట‌డం ఏమిటి? రిలేష‌న్స్ రివ‌ర్స్ అయిపోవూ..?? అనుకొంటున్నారా?? అంత ప్ర‌మాదం ఏమీ లేదు. వీరిద్ద‌రూ జోడీగా తెర‌పై క‌నిపించేది సినిమా కోసం కాదు. `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` పోగ్రాం కోసం. మా టీవీలో ప్ర‌సారం అవుతున్న ''మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు'' రెండో సీజ‌న్‌కీ అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. నాగ్ అప్పుడే త‌న షోకి సెల‌బ్రెటీల‌ను తీసుకురావ‌డం మొద‌లెట్టేశాడు. సీజ‌న్ 2 లో తొలి సెల‌బ్రెటీ హోదా ద‌క్కించుకొంది స‌మంత‌. నాగ్ అడిగిన అల్ల‌రి ప్ర‌శ్న‌ల‌కు స‌మంత కూడా కొంటెగానే స‌మాధానాలు ఇచ్చింద‌ట‌. ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కాబోతోంది. అన్న‌ట్టు ఈ పోగ్రాం ద్వారా స‌మంత ఆరున్న‌ర ల‌క్ష‌లు సంపాదించింద‌ట‌. ఆ డ‌బ్బును సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తాన‌ని నాగ్‌కి మాట ఇచ్చింది. నాగ్ ప్ర‌శ్న‌లు - స‌మంత స‌మాధానాలు ఏ రీతిన సాగాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక ప‌ట్టాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.