English | Telugu

తెలుగు రీమేక్స్‌తో సల్మాన్ హ్యాట్రిక్ హిట్



బాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మారిన సల్మాన్ ప్రస్తుతం కిక్ సినిమా కలెక్షన్ల్ సందడిలో వున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 85 కోట్లు సంపాదించిందని టాకు. రంజాన్ పండుగ సెలవు రోజున ఈ సినిమా వంద కోట్ల బిజినెస్ పూర్తి చేసుకుంటుందని గట్టి నమ్మకంతో వున్నారు 'కిక్' ఫిలిం మేకర్స్.
ఇక ఈ సినిమా చూసిన ఒరిజినల్, తెలుగు 'కిక్' సినిమా రూపకర్త సురెంద్ర రెడ్డి మాత్రం ఈ సినిమా చూసి చాలా డిసపాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు సినిమాను అర్థం చేసుకున్నట్లు కానీ, సల్మాన్ ఖాన్ కి తగ్గట్టు కానీ లేదని ఆయన ఫీల్ అయినట్లు తెలుస్తోంది. మరో వైపు బాలీవుడ్ ప్రముఖ దర్శకులు కరణ్ జోహర్, సుభాష్ ఘయ్ వంటి వారు ఈ సినిమా అదిరిపోయిందటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇవన్నీ అటుంచితే సల్మాన్ ఖాన్ కి మాత్రం తెలుగు రీమేక్ లు బాగా అచ్చోస్తాయని మరోసారి ప్రూవ్ అయింది. పోకిరి, రెడీ, ఇప్పుడు కిక్ సినిమాలు తెలుగు నుంచి హిందీలో సల్మాన్ హీరోగా రూపొందిన చిత్రాలే.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.