English | Telugu

మెగా హీరోల ప‌రువు తీసిన‌... సైమా

సంపూతో మెగా హీరోలు పోటీ ప‌డితే ఎలా ఉంటుంది?? అందులోనూ ఓ అవార్డు కోసం..?? సంపూ రేంజు పెరిగిందనుకోవాలా, లేదంటే మెగా హీరోల స్థాయి దిగ‌జారింద‌నుకోవాలా?? అనే ప్ర‌శ్న త‌ప్ప‌కుండా ఉద‌యిస్తుంది. అలా మెగా హీరోల‌తో `సైమా` ఆటాడేసుకొంది. టోట‌ల్‌గా మెగా ఫ్యామిలీ ప‌రువు తీసింది. దక్షిణాదిన‌ సినిమా రంగానికి సంబంధించి ప్ర‌తి ఏడాదీ ‘సైమా’ అవార్డ్స్ ని ఇస్తోంది.

2014 సంవ‌త్స‌రానికి గానూ సైమా త‌న నామినీ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ లిస్టు చూసి మెగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే బెస్ట్ డెబ్యూ హీరోల లిస్టులో సాయి ధరమ్ తేజ్ (పిల్లా నువ్వు లేని జీవితం), వరుణ్ తేజ్ (ముకుంద‌) పేర్లు క‌నిపించాయి. ఆ ప‌క్క‌నే సంపూర్ణేష్ బాబు (హృద‌య‌కాలేయం) పేరు ఉండ‌డం...మెగా ఫ్యాన్స్‌ని విస్మ‌య‌ప‌రిచింది. ఈ అవార్డు కోసం సంపూతో వీళ్లు పోటీ ప‌డాలా?? అంటూ ముక్కున వేలేసుకొంది.

ఒక వేళ సంపూకే ఈ అవార్డు ద‌క్కితే తమ హీరోల ప‌రువేంగానూ.. అంటూ మెగా ఫ్యాన్స్ త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ వేడుక‌కు మెగా హీరోలు హాజ‌ర‌వుతారా? అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. మ‌రి మెగా హీరోలు దీన్ని త‌మ ప్రెస్టేజియ‌స్ ఇష్యూగా తీసుకొంటారో, లేదంటే స్పోర్టీవ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.