English | Telugu

Mass Jathara: రవితేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అంతలోనే మరో ట్విస్ట్!

- రవితేజ ఫ్యాన్స్ కి ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
- ఒకరోజు ఆలస్యంగా మాస్ జాతర..?
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆ స్టార్ హీరో

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) ఫ్యాన్స్ నిరాశచెందేలా ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అంతలోనే వారిని హ్యాపీ చేసేలా ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం. (Mass Jathara)

2022లో వచ్చిన 'ధమాకా' తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ.. ఈ వారం 'మాస్ జాతర'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్ 31న 'బాహుబలి' రీ-రిలీజ్ అవుతుండటంతో.. ఒకరోజు ఆలస్యంగా వచ్చే అవకాశముంది అంటున్నారు. ఇది చాలదు అన్నట్టు.. అక్టోబర్ 27న తలపెట్టిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారిలో ఉత్సాహాన్ని నింపేలా.. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Also Read:మరోసారి వాయిదా పడిన మాస్ జాతర!

'మాస్ జాతర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పటికీ.. ట్రైలర్ విడుదలలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం సాయంత్రం ట్రైలర్ విడుదలవుతోంది. అంతేకాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బదులుగా.. అక్టోబర్ 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ సూర్య హాజరుకాబోతున్నారు.

సూర్య తన 46వ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సూర్య.. అదే బ్యానర్ నుండి వస్తున్న మరో సినిమా 'మాస్ జాతర' ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు అన్నమాట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.