English | Telugu

ఢిల్లీ భామకి ఫుల్ డిమాండ్

'రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. గోపీచంద్ సరసన 'లౌక్యం', రామ్ సరసన 'పండుగ చేస్కో', మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ', ఆది సరసన 'రఫ్' చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. మాస్ మహరాజా రవితేజ సరసన నటించే అవకాశం రకుల్ కి దక్కిందని తెలుస్తోంది. రవితేజ తో నటిస్తుండడంతో ఈ సారి రకుల్ టాలీవుడ్ పెద్ద హీరోల దృష్టిలో పడుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ ఆఫర్ ను తలచుకుని ఈ బ్యూటీ తెగమురిసిపోతుందట.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.