English | Telugu

బద్రీనాధ్ ప్రాంగణంలో రజనీకాంత్.. వాళ్ళల్లో కలిసిపోయాడు 

సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)ఆగస్టులో 'కూలీ'(Coolie)తో వచ్చి తన కెరీర్ లో మరోసారి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కతున్న పార్ట్ 2 లో చేస్తున్నాడు. జైలర్ సూపర్ హిట్ అందుకోవడంతో పార్ట్ 2 పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రజనీకాంత్ చాలా కాలం నుంచి హిమాలయాలకి(Himalayas)వెళ్లి వస్తుంటాడనే విషయం తెలిసిందే. ఈ కోవలోనే రీసెంట్ గా హిమాలయ పర్యటనకి బయలుదేరి వెళ్ళాడు. పర్యటనలో భాగంగా హిమాలయాల్లోని బద్రీనాధ్(Badrinath)లో కొలువై ఉన్న బద్రినాధుడి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. రజనీకాంత్ రాక సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అదే విధంగా ఒక మాములు సాధారణ వ్యక్తిలా రజనీ కాంత్ రోడ్ పక్కనే భోజనం చేస్తున్నస్టిల్స్ కూడా వైరల్ గా నిలిచాయి. ఇప్పుడు వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ రజనీకాంత్ సింప్లిసిటీ ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.