English | Telugu

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ మీద అనేక అపవాదులు, నిందలు డాక్టర్ రాజశేఖర్, జీవితలు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా, చిరంజీవి మీద బురదజల్లే కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ దంపతులు అదే పనిగా రికార్డులతో సహా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎన్నో అన్యాయాలకూ, అక్రమాలకూ పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. దానికి స్పందించిన బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళిద్దరిపై పరువునష్టం దావా వేసింది.

ఆ కేసుకి సంబంధించి మియాపూర్ జడ్జి కోర్టుకి హాజరుకావల్సిందిగా రాజశేఖర్ దంపతులను ఆదేశించింది. కానీ వీరు కోర్టుకి హాజరు కాకపోవటంతో వీళ్ళిద్దరినీ కోర్టుకు హాజరు కావలని లేదా అరెస్ట్ చేస్తామని వార్నింగివ్వటం వలన ఆ దంపతులు మియా పూర్ కోర్టుకి హాజరయ్యారు. కోర్టులో జడ్జి వీళ్ళిద్దర్నీ కోర్టులో మూడు గంటల పాటు కూర్చోవలసిందిగా ఆదేశిస్తూ, వాయిదాలకు హాజరు కాకుండా కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు గానూ 500 రూపాయల జరిమానా వేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.