English | Telugu

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం

డాక్టర్ రాజశేఖర్, జీవితలకు కోర్టులో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళితే గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ మీద అనేక అపవాదులు, నిందలు డాక్టర్ రాజశేఖర్, జీవితలు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా, చిరంజీవి మీద బురదజల్లే కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ దంపతులు అదే పనిగా రికార్డులతో సహా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎన్నో అన్యాయాలకూ, అక్రమాలకూ పాల్పడుతుందని ఆరోపణలు చేశారు. దానికి స్పందించిన బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం వాళ్ళిద్దరిపై పరువునష్టం దావా వేసింది.

ఆ కేసుకి సంబంధించి మియాపూర్ జడ్జి కోర్టుకి హాజరుకావల్సిందిగా రాజశేఖర్ దంపతులను ఆదేశించింది. కానీ వీరు కోర్టుకి హాజరు కాకపోవటంతో వీళ్ళిద్దరినీ కోర్టుకు హాజరు కావలని లేదా అరెస్ట్ చేస్తామని వార్నింగివ్వటం వలన ఆ దంపతులు మియా పూర్ కోర్టుకి హాజరయ్యారు. కోర్టులో జడ్జి వీళ్ళిద్దర్నీ కోర్టులో మూడు గంటల పాటు కూర్చోవలసిందిగా ఆదేశిస్తూ, వాయిదాలకు హాజరు కాకుండా కోర్టు ఆర్డర్లను ధిక్కరించినందుకు గానూ 500 రూపాయల జరిమానా వేసింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.