English | Telugu

మాస్ జాతర తర్వాత రవితేజ విజ్ఞప్తి..!

ఇటీవల 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజా రవితేజ. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూశారు. కానీ, 'మాస్ జాతర' కూడా మెప్పించలేకపోయింది. దీంతో నెక్స్ట్ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

రవితేజ తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Also Read: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని అందించడంలో దిట్ట. అలాంటిది ఈ ఇద్దరు కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ తో వస్తున్నారంటే.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

మరి ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం