English | Telugu

ఎన్టీఆర్ నే నమ్ముకున్నాడు

పూరి జ‌గ‌న్నాథ్ సినిమా అంటే అందులో ఆలీ ఖచ్చితంగా వుండాల్సిందే. పూరి ప్రతి సినిమాలోనూ ఆలీకి ఓ సెప‌రేట్ ట్రాక్ ఉంటుంది. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ సినిమా అయినా తీసుకోండి ..ఇడియ‌ట్‌, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి, పోకిరి, దేశ‌ముదురు, సూప‌ర్‌, చిరుత అన్ని సినిమాల్లో ఆలీ వుంటాడు. క‌థ‌లో అలీ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోయినా, ఏదోలా క‌థ‌లో దూర్చి వినోదం సృష్టిస్తాడు పూరి. అయితే ఈ అయితే, ఈసారి మాత్రం 'టెంపర్' లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో పూరీజగన్నాథ్ ఈ ఇద్దరికీ ప్లేస్ ఇవ్వలేదట. దీనికి కారణం ఎన్టీఆరేనట. జూనియర్ ఎన్టీయార్‌లోని అన్ని యాంగిల్స్‌ను బయటకు తేవాలని కమెడియన్లను పక్కకు పెట్టాడట. అలాగే ఈ సినిమాలో హీరో, విల‌న్‌, ఆఖ‌రికి ఐటెమ్ కూడా ఎన్టీఆరే అని చెప్పిన పూరి..ఎన్టీయార్‌తోనే కామెడీ ట్రాక్ కూడా పండించేలా ప్లాన్ చేశాడట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.