English | Telugu

కళ్యాణ్ పవర్ చూపిస్తున్నాడు

నందమూరి పటాస్‌ భాక్సాఫీసు వద్ద ఎంతలా పేలిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాలతో డీలాపడిన కల్యాణ్‌రామ్‌ నుంచి అంచనాల్లేకుండా వచ్చిన పటాస్‌ ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్‌ల పరంగానూ కల్యాణ్‌రామ్‌ గత చిత్రాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఊపులోనే ప్రస్తుతం శాటిలైట్‌ విక్రయాల్లోనే బాగానే పేలింది. కొన్ని సినిమాలు అంచనాల ఆధారంగా విడుదలకు ముందే శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోతుంటాయి. అయితే పటాస్‌ బంపర్‌ హిట్టైన నేపథ్యంలో శాటిలైట్‌ హక్కులు కూడా అంతే దిశగా పయనించింది. పటాస్‌ మూవీశాటిలైట్‌ హక్కులను దక్కించుకునేందుకు టీవీ ఛానెళ్ల మధ్య విపరీత పోటీ నెలకొనగా.. ఓ ప్రముఖ ఛానెల్‌ రూ.4కోట్ల 30లక్షలు ఇచ్చి పటాస్‌ శాటిలైట్‌ హక్కులను దక్కించుకుంది కల్యాణ్‌రామ్‌ గత చిత్రాల్లోకెల్లా అత్యధిక ధరకు శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోయిన సినిమాగా పటాస్‌ నిలిచింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.