English | Telugu

గేమ్ ఛేంజర్ పోతే చరణ్ ఫోన్ కూడా చేయలేదు.. వాళ్ళిద్దరికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది!

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారని పేరుంది. సినిమాలకు సంబంధించి ఏ విషయం మీదైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలా అని వివాదాస్పదమయ్యేలా మాట్లాడటం దిల్ రాజు చేయరు. కానీ, ఆయన సోదరుడు శిరీష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దిల్ రాజు తరహాలోనే ఆయన కూడా నిర్మొహమాటంగా మాట్లాడుతున్నప్పటికీ.. కాస్త లైన్ దాటి మాట్లాడటంతో అవి కాంట్రవర్సీ అవుతున్నాయి.

దిల్ రాజు, శిరీష్ నిర్మించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా శిరీష్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.

"గేమ్ ఛేంజర్ తో మా బతుకు అయిపోయిందనుకున్నాం. సంక్రాంతికి వస్తున్నాంతో హోప్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లోనే జీవితం మారింది. అదే రాకపోతే మా పరిస్థితి ఏంటి?. ఇక్కడ ఎవరూ త్యాగాలు చేయరు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. హీరో(రామ్ చరణ్) వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్(శంకర్) వచ్చి హెల్ప్ చేశాడా? కనీసం ఎలా ఉన్నారు ఏంటని కూడా పరామర్శించలేదు. అలా అని మేము ఎవరినీ బ్లేమ్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఇది బిజినెస్. మా ఇష్టంతో సినిమా చేశాం.. నష్టం వచ్చింది. సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్స్ వెనక్కి ఇవ్వమని మేము అడగము. మా డిస్ట్రిబ్యూటర్స్ ని మేమే సేవ్ చేసుకుంటాం." అని శిరీష్ చెప్పారు. అయితే శిరీష్ చేసిన ఈ కామెంట్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలకు లాభనష్టాలు సహజం. కానీ, పదే పదే గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడటం ఏంటని ఫైర్ అవుతున్నారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ పై కూడా శిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టమొస్తే ఆదుకోరని అన్నారు. కానీ సితార సంస్థ నాగవంశీ అలా కాదని.. డిస్ట్రిబ్యూటర్స్ శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడని చెప్పారు. మైత్రికి, నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. మైత్రి నక్క అయితే, నాగవంశీ నాగలోకం అని శిరీష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.