English | Telugu

మీ అందరినీ నిరాశపరిచినందుకు సారీ.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత నాగవంశీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగునాట ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. అలాగే నాగవంశీ నిర్మించిన గత చిత్రం 'కింగ్డమ్' కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ వరుస షాక్ లతో నాగవంశీ డిప్రెషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఫోన్ స్విచాఫ్ చేశారని, దుబాయ్ వెళ్లిపోయారని, సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నారని.. ఇలా రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక ట్వీట్ తో ట్రోలర్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగవంశీ.

"ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని ఆసక్తికర కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది. పర్లేదు, ఎక్స్(ట్విట్టర్)లో మంచి రైటర్స్ ఉన్నారు. మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి. ఇంకా ఆ టైం రాలేదు. కనీసం ఇంకో 10-15 ఏళ్ళు ఉంది. ఎల్లప్పుడూ సినిమాతోనే ఉంటాను. త్వరలోనే 'మాస్ జాతర' సినిమాతో మీ అందరినీ కలుస్తాను." అని నాగవంశీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. "నాగవంశీ సినిమాలు వదిలేశారు, దుబాయ్ వెళ్లిపోయారు" అంటూ జరుగుతున్న ప్రచారాలకు ఒకే ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం