English | Telugu

ప్రభాస్ కొత్త సినిమా లాంచ్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'కల్కి'(Kalki)తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ఇప్పటికే 'రాజా సాబ్' (Raja Saab) షూటింగ్ 40 శాతం పూర్తి చేశాడు. ఆగష్టు 2 నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. మరోవైపు ఆగష్టులోనే మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు ప్రభాస్.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఫౌజీ' (Fauji) అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లాంచ్ కి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఆగష్టు 17న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుందట. అంతేకాదు ఆగష్టు 24 నుంచి షూట్ కూడా స్టార్ట్ కానుందని వినికిడి.

నిజానికి ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుందనే న్యూస్ విని.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వాలి. కానీ ఈ న్యూస్ విని, ప్రభాస్ ఫ్యాన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. మూవీ లాంచ్ కి ప్రభాస్ వచ్చేలా ఉంటేనే ఈవెంట్ చేయండని, లేదంటే అసలు అక్కర్లేదని అంటున్నారు. 'రాజా సాబ్' అనౌన్స్ మెంట్ టైంలో నిర్వహించిన ఈవెంట్ కి ప్రభాస్ రాలేదు. అందుకే ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు.

ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే.. ముందు 'స్పిరిట్' పూర్తి చేసి, ఆ తర్వాత 'ఫౌజీ' చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ లో 'రాజా సాబ్' 24వ సినిమా. ఆ తర్వాత చేసేది 25వ సినిమా అవుతుంది. అందుకే ల్యాండ్ మార్క్ మూవీగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో 'స్పిరిట్' లాంటి మాస్ బొమ్మ పడితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరికొందరు మాత్రం 25 సినిమాని హను రాఘవపూడితో చేయడమే కరెక్ట్ అని, ప్రభాస్ కెరీర్ లో క్లాసిక్ ఫిల్మ్ ని అందిస్తాడని అభిప్రాయపడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.