English | Telugu

ఓజీ మూవీ.. పవన్ ఫ్యాన్స్ కి నిరాశ.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన 'ఓజీ' (OG) చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా చూస్తూ థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. పవన్ కనిపించిన ప్రతి సీన్ ఎలివేషన్ లా ఉందంటూ.. డైరెక్టర్ సుజీత్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సమయంలో ఓ విషయంలో మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. మూవీ టీమ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. (They Call Him OG)

'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్.. తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. పవన్ టీనేజ్ రోల్ లో అకీరా కనిపిస్తాడని బలంగా వార్తలు వినిపించాయి. కానీ, తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే.. ఇందులో అకీరా లేడు.

Also Read:ఓజీ మూవీ రివ్యూ

నిజానికి ఈ సినిమాలో టీనేజ్ ఓజీ పాత్రను కూడా బాగా చూపించారు. అసలు ఆ పాత్ర ఇంట్రో సీన్ వస్తుంటే.. అది చేసింది అకీరానే అయ్యుంటాడని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. కానీ, ఫేస్ రివీల్ అయ్యాక అకీరా కాదని తెలియడంతో.. వారు నిరాశ చెందారు. ఒకవేళ ఓజీలో టీనేజ్ పాత్ర నిజంగానే అకీరా చేసుంటే మాత్రం.. ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయ్యేది అనడంలో సందేహం లేదు. పైగా, అకీరాకు కూడా ఇది మంచి డెబ్యూ అయ్యేది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.