English | Telugu

మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో 'వినోదయ సిత్తం' రీమేక్, 'హరి హర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ' వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.

త్రివిక్రమ్ కథతో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు 'రావణాసుర' మూవీ ప్రమోషన్స్ సమయంలో సుధీర్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పవన్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, 2024 ఎన్నికల తర్వాతే సుధీర్ ప్రాజెక్ట్ కి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ మాత్రం ఈ ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఐదారు నెలల్లో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ-మాటలు అందిస్తుండటం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో సెప్టెంబర్ తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.