English | Telugu

వరుణ్ సందేశ్ నూతన చిత్రం 'వన్ వే టికెట్' ఘనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా 'వన్ వే టికెట్' అనే నూతనత్త చిత్రం ప్రారంభమైంది. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్స్ పై జొరిగే శ్రీనివాసరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం (జూలై 27) ఘనంగా జరిగాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు వచ్చిన ముఖ్య అతిథులు ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. ప్రముఖ దర్శకుడు త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ .. "మా వరుణ్ సందేశ్‌ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం నాకు ఆనందంగా ఉంటుంది. వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశాను. మా డార్లింగ్ వరుణ్ సందేశ్‌కు ఓ హిట్ రావాలన్నదే నా కల. ఈ ‘వన్ వే టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను"అని అన్నారు.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. "వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేను ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నాం. కుష్బూ, మనోజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. అందరి ఆశీస్సులు మా సినిమాకు, టీంకు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ .. "శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ బ్యానర్లపై ఇది మా రెండో చిత్రం. ఈ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ థాంక్స్. వరుణ్ సందేశ్ హీరోగా ఈ మూవీని పళని స్వామి తెరకెక్కిస్తున్నారు. అందరూ మా చిత్రానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు ఏ. పళని స్వామి మాట్లాడుతూ .. "వన్ వే టికెట్ క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది. చాలా మంచి స్క్రిప్ట్ కుదిరింది. వరుణ్ సందేశ్ హీరోగా శ్రీనివాసరావు గారు నిర్మిస్తున్నారు. మా మూవీ పూజా కార్యక్రమాలకు వచ్చిన వారందరికీ థాంక్స్" అన్నారు.

కుష్బూ చౌదరి మాట్లాడుతూ.. "మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ గారితో పని చేయనుండటం ఆనందంగా ఉంది" అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ .. "ఈ మూవీ కథ చాలా అద్భుతంగా ఉండబోతోంది. తమిళ దర్శకుడు పళని ఈ మూవీని చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో రూపొందించబోతోన్నారు. 13 ఏళ్ల తరువాత మళ్లీ వరుణ్ సందేశ్‌తో కలిసి పని చేస్తున్నాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ .. "మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ చిత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతీ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, పళని గారికి థాంక్స్" అన్నారు.

నటుడు సుధాకర్ మాట్లాడుతూ .. "వన్ వే టికెట్ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. వరుణ్ సందేశ్ హీరోగా ఈ మూవీని శ్రీనివాసరావు నిర్మిస్తుండగా.. ఏ. పళని స్వామి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్" అన్నారు.

ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్ ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా శ్రీనివాస్ బెజుగమ్, సంగీత దర్శకుడిగా కార్తిక్ పని చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.