English | Telugu

పవన్ హీరోయిన్ ని పడేసిన గుర్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి' సినిమా హీరోయిన్ నికిషా పటేల్ ని గుర్రం కింద పడేసి౦దట. టాలీవుడ్ లో అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నికిషాకి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'ఆలోనే' మూవీ కోసం గుర్రపు స్వారీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఆమె కింద పడిపోయిందట. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా కంగారుపడ్డారట. అయితే తనకు దెబ్బలు కూడా బాగానే తగిలాయని నికిషా పటేల్ ట్విట్టర్ లో పేర్కొంది. ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటోంది. కొంచెం కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటా అని పేర్కొంది నికిషా. ప్రస్తుత౦ నికిషా పటేల్ చేతిలో.. 'నరతన్', 'సిగండి' అనే మరో రెండు తమిళ్ సినిమాలు రెడీగా వున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.