English | Telugu

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్!

2025లో 'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించారు. ఈ ఏడాది ఆయన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అలరించనున్నారు. దీని తర్వాత పవన్ సినిమాలు కొనసాగిస్తారా? చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఆయన నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చేసింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, రాజకీయాలతో పాటు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో.. ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ కదలిక వచ్చిందని, పవన్ మిలిటర్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని రెండు నెలల క్రితం తెలుగువన్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చింది. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి కీలక ప్రకటన చేశారు.

పవర్ స్టార్ ఆశీస్సులతో 'జైత్ర రామ మూవీస్' బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు రామ్ తాళ్లూరి అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో చేతులు కలిపినట్లు తెలిపారు.

పవన్ ఇటీవల షార్ట్ హెయిర్, ఆర్మీ ప్యాంటు ధరించి కొత్త లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. రామ్ తాళ్లూరి ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

2025 నవంబర్ లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన తెలుగువన్.

--మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం