English | Telugu

ఆడియన్స్ నూ ప్రేమలో పడేస్తా: సచిన్ జోషి

‘మౌనమేలనోయి’, ‘నినుచూడక నేనుండలేను’, ఒరేయ్’ పండు సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా తన ప్రత్యేకతను చాటుకున్న హీరో సచిన్ జోషి. ఆయన పుట్టిన రోజు నేడు. టాలీవుడ్ చాలా రోజులు తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న సచిన్ ఈ సారి ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. అందుకోసం బాలీవుడ్ లో సక్సెస్ అయిన మ్యూజికల్ లవ్ స్టొరీ 'ఆషికి-2 ' తెలుగులో ‘నీ జతగా నేనుండాలి’ అనే టైటిల్ తో రీమెక్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఆడియో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మధ్య తెలుగులో యాభై వేలకు పైగా ఆడియో సీడీలు అమ్ముడై పోయిన సినిమా ఇదేనట.

ఈ సినిమా గురించి హీరో మాట్లాడుతూ.. '''ఆషికి-2 'తెలుగు నెటివిటీకి తగిన విధంగా సినిమా ప్రెజంట్ చేయడంలో, మేకింగ్, మ్యూజిక్ పరంగా లవ్ ఫీల్ ను ప్రేక్షకులకు అందించడానికి తగిన మార్పులు చేశాం. తెలుగులో వస్తోన్న లవ్ స్టోరీలో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుంది. బి, సి సెంటర్స్ లోని ఆడియెన్స్ కి కూడా సినిమా బాగా రీచ్ అవుతుంది. చంద్రబోస్ గారి సాహిత్యం సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగా ఉంటుంది. అది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి.'' అని సచిన్ జోషి అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.