English | Telugu

బాల‌య్య రికార్డు బ్రేక్ చేయ‌బోతున్న నాని

ఒకే రోజు... ఒక హీరో సినిమాలు... ఓకేసారి రెండు రిలీజ్ అయితే..??
అప్పుడెప్పుడో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన నిప్పుర‌వ్వ‌, బంగారు బుల్లోడు ఒకేసారి విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు అలాంటి ఫీట్ చేయ‌బోతున్నాడు యువ క‌థానాయ‌కుడు నాని. ఆయ‌న న‌టించిన రెండు చిత్రాలు ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అవే.. జెండాపైక‌పిరాజు, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం. వీటిలో అంద‌రి దృష్టీ ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంపైనే ఉంది. ఎందుకంటే ట్రైల‌ర్లు ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు అశ్వ‌నీద‌త్ సినిమా. అనేక సార్లు వాయిదా ప‌డ్డ జెండాపైక‌పిరాజుపై ఎవ్వ‌రికీ ఆస‌క్తి లేదు. పైగా త‌మిళంలో ఫ్లాప్ అయిన సినిమా అది. అయినా స‌రే.. జెండాపైక‌పిరాజు హ‌క్కుల్ని సొంతం చేసుకొన్న మ‌ల్టీడైమెన్ష‌న్ వాసు మాత్రం ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అశ్వ‌నీద‌త్‌పై త‌మ సినిమాని విడుద‌ల చేయ‌డం ఖాయం అంటున్నారు. మొత్తానికి నాని వ‌ర్సెస్ నాని పోటీని చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. ఈ ఇద్ద‌రు నిర్మాత‌లూ క‌ల‌సి నాని కెరీర్‌తో ఆటాడుకోవ‌డం లేదు క‌దా..? ఎందుకంటే రెండు సినిమాలూ ఆడ‌డం క‌ల్ల‌. ఒక‌వేళ రెండూ ఫ్లాప్ అయితే.. ఒకే రోజు రెండు స్ట్రోకులు త‌ట్టుకోవ‌డం నానికి సాధ్య‌మేనా??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.