English | Telugu

మోక్షజ్ఞ కన్నా ముందే కెమెరా ముందుకు తేజస్విని!

నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కన్నా ముందే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కెమెరా ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Nandamuri Tejaswini)

కొంతకాలంగా బాలకృష్ణ సినిమా వ్యవహారాల్లో తేజస్విని చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే, అఖండ-2 సినిమాకి ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్నిరోజులుగా తెరవెనుక ఉన్న ఆమె, ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడానికి తేజస్విని అంగీకరించారట. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. త్వరలోనే యాడ్ ప్రసారం కానుందని అంటున్నారు. మరి తేజస్విని భవిష్యత్ లో సినిమాల్లో కూడా నటిస్తారేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.