English | Telugu

లెజెండ్ కు భయపడిన భయం

బాలయ్య నటించిన "లెజెండ్" సినిమా బ్లాక్ బస్తర్ హిట్టయ్యి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇంత ఘనవిజయం చేసిన ప్రేక్షకుల కోసం బాలయ్య సింహ యాత్ర చేస్తున్నారు. గతకొద్ది రోజులుగా "లెజెండ్" చిత్ర యూనిట్ కొంతమంది రాష్ట్రంలోని పలు దేవాలయాలను, సినిమా థియేటర్ లను సందర్శిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలో అభిమానులు భారీ ఎత్తున బాలయ్య కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో మంచి స్పీడ్ మీద ఉన్న కొంతమంది అభిమానుల బైక్ అదుపుతప్పడంతో కొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న కారుని సడెన్ బ్రేక్ తో ఆపడంతో బాలయ్య కుదుపులకు లోనయ్యాడు. కానీ బాలయ్య జాగ్రత్తగా ఉండటంతో పెద్దగా ఎలాంటి గాయాలు కాలేదు. బాలయ్యకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.