English | Telugu

శివరాత్రి రోజు రవితేజ అభిమానుల జాతర  

మాస్ మహారాజా 'రవితేజ'(Ravi Teja)హీరోగా 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్'(Naa Autograph Sweet Memories) .రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి రవితేజ కెరీర్లోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఒక అబ్బాయికి యవ్వన ప్రాయంలో కలిగిన ప్రేమ తాలూకు జ్ఞాపకాలతో పాటు, గతానికి సంబంధించిన విషయాలన్నీ అతనికి అమృతాన్ని నింపుకున్న రోజులుగా గుర్తుకురావడమనేది ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించారు.

ఇప్పుడు ఈ మూవీ 'మహా శివరాత్రి'(Maha Shivratri)పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 22 న రీ రిలీజ్ కాబోతుంది.ఈ మేరకు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు.దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఆసక్తి తో ఉన్నారు.మూవీ లవర్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పట్నుంచో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' ని రీ రిలీజ్ చెయ్యాలని కోరుతునే ఉన్నారు.

ఇక ఈ మూవీకి ఎన్నో హిట్ సినిమాలకి కెమెరామెన్ గా పని చేసిన ఎస్ గోపాల్ రెడ్డి(s.Gopal reddy)దర్శకత్వం వహించగా అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh)నిర్మాతగా వ్యవహరించాడు.కీరవాణి(Keeravani)అందించిన సంగీతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మూవీలోని పాటలు నేటికీ చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి.గోపిక, భూమిక,మల్లిక,హీరోయిన్లుగా చేసిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' చేతన్(Chethan)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం'ఆటోగ్రాఫ్' కి రీమేక్ గా రూపొందింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.