English | Telugu

హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ.. స్టార్స్ ని దాటుకొని వచ్చిన బిగ్ ప్రాజెక్ట్!

'ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది' అంటారు. అలాగే, ప్రతి కథ ఏ నటుడి దగ్గరకు వెళ్ళాలనేది ముందే రాసి ఉంటుంది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కథ ఎందరో హీరోలను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ కథతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. (Devi Sri Prasad)

కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 'బలగం' విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాని హీరోగా 'ఎల్లమ్మ' అనే సినిమాని ప్రకటించాడు వేణు. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ కి, అటు నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. (Yellamma)

ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో సంగీతం దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ, ఎందుకనో అది జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎందరో హీరోలను దాటుకొని వచ్చిన 'ఎల్లమ్మ' కథతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తుంది. అదే నిజమైతే హీరోగా దేవిశ్రీ ప్రసాద్ కి సాలిడ్ ఎంట్రీ దొరికినట్లే.

'ఎల్లమ్మ' సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. సాయిపల్లవి, కీర్తి సురేష్ వంటి పేర్లు వినిపించాయి. మరి ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళ్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.